ప్రకృతి ఒడిలో కొలువైన ఎల్ మడుగు అందాలు కనవిందు చేస్తున్నాయి. ఓవైపు దట్టమైన అడవి.. మరోవైపు గళగళపారేటి గోదావరినది. ఇంకోవైపు పచ్చటి పొలాలు.. ఇలా అనేక ప్రకృతి సోయగాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ శివారులోని ఎల్ మడుగు అందాలు ఒకవైపు కనువిందు చేస్తుంటే మరోవైపు మంచిర్యాల జిల్లా శివ్వారం అభయారణ్యంలోని మొసళ్ల పెంపక కేంద్రం మరింత ఆకర్షణగా నిలుస్తోంది. పచ్చని అడవులతో ఆహ్లదం పంచే ఈ ఎల్మడుగును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఖానాపూర్ సర్పంచ్ సంగెం అరుణ గట్టయ్య కోరారు. – మంథనిరూరల్


