ఓదెల: శీత్లాభవాని ఆశీస్సులతో తండాలు సుభిక్షింగా ఉండాలని ప్రభుత్వ విప్ విజయరమణావు ఆ కాంక్షించారు. లంబాడితండాలో మంగళవారం జరిగిన శీత్లాభవాని ఉత్సవాల్లో విప్ ప్రత్యేకపూజలు చే శారు. ఈ సందర్భంగా తండావాసులు, ప్రముఖు లు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పెద్దపల్లి డీసీ పీ భూక్యారాంరెడ్డి, పూజారి మహరాజ్ సేవాలాల్, సర్పంచ్ గుగులోతు నిమ్మనాయక్, ఉప సర్పంచ్ గుగులోతు నిమ్మనాయక్, తహసీల్దార్ వనజ నా యక్, ఎంపీడీవో అనిల్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గంట అక్షితయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు మరో కేబినెట్ ర్యాంకు
పెద్దపల్లి: జిల్లాను మరో క్యాబినెట్ ర్యాంకు వరించింది. ఇప్పటికే మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు మంత్రిగా ఉన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. తా జాగా విజయరమణారావు, యెన్నం శ్రీనివాస్రెడ్డి, వేముల వీరేశంకు రాష్ట్రమంత్రి (మినిస్టర్ ఆఫ్ స్టే ట్) హోదా కల్పిస్తూ జీవో1064 జారీ అయ్యింది. విజయరమణారావుకు రాష్ట్రమంత్రి హోదా కల్పించడంపై నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నృత్యాలు చేస్తున్న తండావాసులు
పూజలు చేస్తున్న విప్ విజయరమణారావు, డీసీపీ
ప్రభుత్వ విప్ విజయరమణారావు


