పెద్దపల్లి: వరంగల్లో ఈనెల 17, 18వ తేదీల్లో చేప ట్టే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ కోరారు. జిల్లా కేంద్రంలో మహాసభల ప్రచార పోస్టర్ను సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర సదానందంతో కలిసి శు క్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, వివిధ కేంద్రప్రభుత్వ శాఖల్లో 45 శాతం ఎస్సీ రిజర్వ్డ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. 45 యూనివర్సిటీల్లోగల 42 శాతం వివిధ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కందుకూరి రాజారత్నం, పెరు క లక్ష్మణ్, పెరిక సతీశ్, అరికిల్ల గణపతి, కల్లపల్లి న వీన్, ఆరెపల్లి మానస, ప్రశాంత్ పాల్గొన్నారు.


