
రేడియేషన్ అంకాలజీలో విప్లవాత్మక మార్పులు
కరీంనగర్టౌన్: ఎంఆర్ లినాక్తో పేషెంట్కు రేడియేషన్ తగ్గించి చికిత్స అందించవచ్చని, మొట్టమొదటి యంత్రం యశోద ఆసుపత్రి హైటెక్సిటీలో ఉందని రేడియేషన్ అంకాలజిస్టు సునీత తెలిపారు. శుక్రవారం యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడా రు. దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేసిన ఈ ఎంఆర్ లినాక్ ఎంఆర్ఐ స్కానర్తో పేషెంట్కు కచ్చితమైన చోటనే రేడియేషన్ కిరణాలు ప్రసరించి సైడ్ ఎఫెక్ట్లు ఉండవన్నారు. ఇప్పటివరకు సుమారు 300 మందికి ఎంఆర్ లినాక్ చికిత్స అందించామని తెలి పారు. మెదడు, కణితులు, ప్రొస్టేట్ కేన్సర్, తల, మెడ కేన్సర్, సీ్త్రలకు సంబంధించి సర్వైకల్ కేన్సన్, గర్భాశయ కేన్సర్, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర కేన్సర్లకు రేడియేషన్ సోకకుండా ఎంఆర్ లినాక్ ద్వారా చికిత్స అందించవచ్చని తెలిపారు.