
ఉత్సాహం నింపిన కేసీఆర్ స్పీచ్
● మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
మంథని: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీచ్ అన్నివర్గాల ప్రజల్లో ఉత్సాహం నింపిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. సభకు ఎన్ని అడ్డంకులు పెట్టినా మంథని నియోజకవర్గంలోని కమాన్పూర్, రామగిరి, ముత్తారం, మంథని, మల్హర్, కాటారం, మహాముత్తారం, మహదేవ్పూర్, పలిమేల మండలాల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు, రైతులు, అన్నివర్గాల వారు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను సభకు తీసుకువెళ్లి సభ సక్సెస్కు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో కేసీఆర్ మాట్లాడిన ప్రతీ మాటను అర్థం చేసుకోవాలని, ఆయన స్ఫూర్తితోనే ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
జీజీహెచ్లో డాక్టర్ చంద్రశేఖర్ సరెండర్
కోల్సిటీ(రామగుండం): రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధులు నిర్వహిస్తున్న డి.చంద్రశేఖర్ను ప్ర జా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులకు సరెండర్ చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్సింగ్ సోమవారం ప్రకటనలో తె లిపారు. ఈనెల 26న జిల్లా కలెక్టర్ జీజీహెచ్ ఆస్పత్రిని పరిశీలించిన సందర్భంగా, డాక్టర్ చంద్రశేఖర్ ఆస్పత్రిలోని ఎంఐసీయూ వార్డు పేషంట్లతో దురుసుగా ప్రవర్తిస్తూ వైద్య వృత్తికే అవమానకరంగా వ్యవహరించడం, పేషెంట్లకు అందించే సేవలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సూపరింటెండెంట్ తెలి పా రు. అలాగే ఎలాంటి సమాచారం అందించకుండా రెండు రోజులపాటు విధులకు గైర్హాజరు అ య్యారని తెలుసుకున్న కలెక్టర్, డాక్టర్ చంద్రశేఖర్ను సరెండర్ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
పెద్దపల్లి ‘బంద్’కు బీజేపీ మద్దతు
పెద్దపల్లిరూరల్: పహల్గాంలో ఉగ్రవాద చర్యను నిరసిస్తూ 29న చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తలపెట్టిన పెద్దపల్లి బంద్కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ సహ అన్నివర్గాల వారు బంద్లో పాల్గొంటున్నారని, ప్రజలు సహకరించాలని కోరారు. నాయకులు సదానందం, పర్శ సమ్మయ్య, నర్సింగం, మోర మనోహర్, శివంగారి సతీశ్, మంథని కృష్ణ, రాజవీరు, సంతోష్, నితీశ్తివారీ, కరుణాకర్ ఉన్నారు.

ఉత్సాహం నింపిన కేసీఆర్ స్పీచ్