విజయనగరం ఫోర్ట్: పీఏసీఎస్ (ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు)ల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పి.కామేశ్వరావు అన్నారు. స్థానిక సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2025 డిసెంబర్ 6 నుంచి 80 రోజుల పాటు నిర్వహించిన ఆందోళన సందర్భంగా పీఆర్సీలు, గ్రాట్యూటీ, ఇన్సురెన్స్ వంటి అంశాలపై హామీలు ఇచ్చినా.. తర్వాత జారీ చేసిన జీఓలు 112, 322 ద్వారా ప్రభు త్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. మోసపూరిత జీఓలు ద్వారా ఉద్యోగులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రానున్న కాలంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. సమావే శంలో ఏఐటీయూసీ నాయకులు రంగరాజు, రెడ్డి సత్యారావు, బెల్లాన రామునాయుడు, డి. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


