అంతర్ వర్సిటీల యోగా పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థిని
రాజాం సిటీ: రాజాంలోని జీఎంఆర్ ఐటీకి చెందిన విద్యార్థిని ఆర్.భవిత అంతర్ విశ్వవిద్యాలయాల యోగా పోటీలకు ఎంపికై ంది. ఇటీవల అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పోటీల్లో ఆమె ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు పీడీ బీహెచ్.అరుణ్కుమార్ ఆదివారం తెలిపారు. జనవరి 5 నుంచి 8 వరకు బెంగళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన డీమ్డ్ యూనివర్సిటీలో జరిగే పోటీల్లో ఆమె పాల్గొంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెను ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు అభినందించారు.


