చంద్రబాబు మాటలేమయ్యాయి..? | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మాటలేమయ్యాయి..?

Nov 29 2025 7:05 AM | Updated on Nov 29 2025 7:05 AM

చంద్రబాబు మాటలేమయ్యాయి..?

చంద్రబాబు మాటలేమయ్యాయి..?

చంద్రబాబు మాటలేమయ్యాయి..?

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి బాధిత మహిళకు అండగా ఉండాల్సింది పోయి, బాధించిన వా డికి అండగా నిలవడం దారుణమని వైఎ స్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. మంత్రి కుమారుడు పృథ్వీ, పీఏ మీద ఎస్పీకి మూడు పేజీల ఫిర్యా దు ఇచ్చినా కనీస చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. ఆడబిడ్డ మీద ఎవరైనా చెయ్యివేస్తే అదే చివరి రోజు అవుతుందని చెప్పిన సీఎం చంద్రబా బు మాటలేమయ్యాయని ప్రశ్నించారు. ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తాం.. తోలుతీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గొంతు మూగబోయిందా అని ప్రశ్నించారు. సహచర మంత్రి పీఏ ఇలా చేస్తే హోం మంత్రి మహిళగా ఏం చేస్తోందని నిలదీశారు. సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ హెల్పర్‌ ఉద్యోగానికి రిజైన్‌ చేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేశారని, ఆమైపె దాడిచేసి కొట్టిన విషయాన్ని ఆమె సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసిన సంగతి బయటకు వచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. శ్రీకాకుళంలో ఆమె శుక్రవారం సాక్షితో మాట్లాడారు. బాధించే వారంతా టీడీపీ నేతలేనని, టీడీపీ తెలుగు దండుపాల్యం పార్టీలా మారిందని మండిపడ్డారు. హోం మంత్రి పక్క రాష్ట్రానికి వెళ్లి డైలాగులు చెప్పడం కాదని, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించే చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్పీకి రాసిన ఫిర్యాదులో బాధిత మహిళ స్పష్టంగా ఆరోపణలు చేశారని, మంత్రి కొడుకు పృథ్వీ, ఇతర పెద్ద నాయకుల వద్దకు కామవాంఛ తీర్చడానికి పంపించమన్న దురాలోచన నుంచి రక్షణ కల్పించాలని కోరిందని అన్నారు. ఇంత జరుగుతున్నా ఆ పీఏను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఆమెను మంత్రి పదవి నుంచి భర్త్‌రఫ్‌ చేయాలని, మంత్రి పీఏని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 18 నెలల్లో మహిళలపై జరిగిన క్రైమ్‌రేట్‌ 4శాతం పెరిగిందని, మహిళలపై జరిగిన రేప్‌లు 9శాతం పెరిగాయన్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వాడకం కూడా 21శాతం పెరిగిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement