చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు

Oct 10 2025 6:26 AM | Updated on Oct 10 2025 6:26 AM

చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు

చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు

చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు

కురుపాం: మండలంలోని గుమ్మ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆయుష్మాన్‌ భవన్‌ మందిర్‌ కార్యాలయంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కురుపాం ఎస్సై నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ గుమ్మ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆయష్మాన్‌ భవన్‌ కార్యాలయంలో గల కంప్యూటర్ల పరికరాలైన సీపీయూ, కీబోర్డులు చోరీకి గురైనట్లు సంబంధిత సిబ్బంది బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా గుమ్మ గ్రామ సమీపంలో చిట్టిగెడ్డ దగ్గర అనుమానస్పదంగా తిరుగుతున్న బర్లి చందు, సింగమహంతి అవినాష్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించారన్నారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని తెలిపారు. చోరీ చేసిన కంప్యూటర్‌ పరికరాల విలువ రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. దర్యాప్తులో ఏఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుల్‌ శేఖర్‌మధు పాల్గొన్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement