సంబరం.. శుభారంభం | - | Sakshi
Sakshi News home page

సంబరం.. శుభారంభం

Oct 7 2025 4:13 AM | Updated on Oct 7 2025 4:13 AM

సంబరం

సంబరం.. శుభారంభం

సంబరం.. శుభారంభం ● అంగరంగ వైభవంగా తొలేళ్ల పండగ ●ఘటాలతో అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం ● అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనువంశిక ధర్మకర్త ● అలరించిన వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ● కోలాహలంగా మారిన చదురుగుడి, వనంగుడి ● నేటి మధ్యాహ్నం 3.05 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం

సంప్రదాయంగా ఉత్సవం

నేడు సిరిమానోత్సవం

● అంగరంగ వైభవంగా తొలేళ్ల పండగ ●ఘటాలతో అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం ● అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనువంశిక ధర్మకర్త ● అలరించిన వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ● కోలాహలంగా మారిన చదురుగుడి, వనంగుడి ● నేటి మధ్యాహ్నం 3.05 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం

సాక్షిప్రతినిధి, విజయనగరం:

త్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మ వారి జాతరలో కీలక ఘట్టమైన తొలేళ్ల ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి జాతరను తొలేళ్ల ఉత్సవంతో శ్రీకారం చుట్టారు. తొలిఏరుగా రైతులు జరుపుకునే పండగలో భాగంగా వేకువజామునుంచే అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చన లు, పూజాధికాలను నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదా యం ప్రకారం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు, సారెను సమర్పించారు. వేదపండితులు వేదమంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా ఆలయ సంప్రదా యం ప్రకారం పూజలు చేపట్టారు.

పైడితల్లి అమ్మవారిని తొలేళ్ల రోజున

దర్శించుకున్న వారిలో...

జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సమే తంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అది తిగజపతిరాజు, ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ డిప్యూటీ స్పీకర్‌, వైఎస్సార్‌సీపీ సీఈ సీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చినవెంకట అప్పలనాయుడు తదితరులు పైడితల్లిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

ఘటాలతో నివేదన..

అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం నగరంలోని పలువురు భక్తులు వివిధ వేషధారణలతో... డప్పు ల మోతలతో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. తొలేళ్ల ఉత్సవం రోజున సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉచిత సేవలు

అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఎన్‌సీసీ, రెడ్‌క్రాస్‌, పోలీస్‌ సేవాదళ్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు మంచినీరు, మజ్జిగ, ఆహారపొట్లాలను ఉచితంగా అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కలెక్టర్‌ రామ్‌ సుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్‌ స్వీయపర్యవేక్షణ చేశా రు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సిరిమాను రథాన్ని హుకుంపేట నుంచి పైడితల్లమ్మ వారి చదురుగుడి ప్రాంగణానికి తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. నిర్ణీత సమయానికి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభమయ్యే లా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గతంలో 2వేల మంది మాత్రమే బందోబస్తు విధులు నిర్వహించేవారని, ఈ ఏడాది 3వేల మందివరకూ సిబ్బందిని నియమించామన్నారు. డ్రోన్‌ కెమెరాలు, బాడీవార్న్‌ కెమెరాలు, మఫ్టీలో 70 మంది పోలీస్‌, ఏఆర్‌, బాంబ్‌ స్క్వాడ్‌, చెకింగ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు స్వీయపర్యవేక్షణ చేస్తున్నాయన్నారు.

సోమవారం రాత్రి అమ్మవారి చదురుగుడి నుంచి ఘటాలతో నడుచుకుంటూ పూజారి వెంకటరావుతో పాటూ పలువురు పెద్దలు, దీక్షాపరు లు కోటలో ఉన్న కోటశక్తికి పూజలు చేశారు. ఆరు ఘటాలను కోట వద్ద నుంచి తిరిగి చదురుగుడికి తీసుకెళ్లి అమ్మవారి చదురువద్ద పెట్టా రు. సిరిమాను పూజారి వెంకటరావు అమ్మవా రి కథను భక్తులకు వినిపించారు. అనంతరం రైతులకు విత్తనాలను అందజేసి, ఆశీర్వచనాల ను అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా సోమ వారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.

సిరులతల్లి సిరిమానోత్సవం మధ్యాహ్నం 12 గంటలకు హుకుంపేట నుంచి బయలు దేరనుంది. ఆలయం వద్దకు రెండు గంటల ప్రాంతానికి చేరు కుంటుంది. అక్కడ నుంచి సిరిమా ను పనులను వడ్రంగులు, నిపుణులు పర్యవేక్షిస్తారు. ముహూ ర్తం ప్రకారం 3.05 గంటలకు సిరిమాను బయలు దేరుతుందని సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు వెల్లడించారు.

సంబరం.. శుభారంభం 1
1/3

సంబరం.. శుభారంభం

సంబరం.. శుభారంభం 2
2/3

సంబరం.. శుభారంభం

సంబరం.. శుభారంభం 3
3/3

సంబరం.. శుభారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement