
పేదవారు వైద్యవిద్య చదవకూడదా?
పేదవారికి వైద్యం, విద్యను ఈ కూటమి ప్రభుత్వం దూరం చేసింది. ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఉండాలన్న మంచి ఉద్దేశంతో ఒకేసారి 17 వైద్య కళాశాలలను గత ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చి, వాటిని ప్రైవేట్కు ధారాదత్తం చేయాలని చూస్తోంది. దళిత, బడుగు, బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేయాలనే చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంలా ఉంది. ఆయా వర్గాల యువతంతా ఆలోచించాలి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి.
– మజ్జి అప్పారావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, సాలూరు నియోజకవర్గం