పది చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పది చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్‌

Aug 6 2025 6:50 AM | Updated on Aug 6 2025 6:50 AM

పది చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్‌

పది చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్‌

పార్వతీపురం రూరల్‌: పది చోరీ కేసులకు సంబంధించిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పార్వతీపురం రూరల్‌ సీఐ గోవిందరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సమావేశలో మాట్లాడుతూ జియ్యమ్మవలస మండలం బట్లభద్ర గ్రామానికి చెందిన తామడ సంతోష్‌ రాత్రి వేళల్లో బయట పడుకునేవారి ఇళ్లల్లోకి వెళ్లి బంగారు ఆభరణాలు, నగదు చోరీకి పాల్పడుతున్నట్లు తెలిపారు.

ఈ మేరకు నిందితుడ్ని బలిజిపేటలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడి నుంచి 10తులాల బంగారు ఆభరణాలు, రూ.13వేల నగదుతో పాటు బొబ్బిలి ప్రాంతానికి చెందిన ద్విచక్ర వాహనదారుడిని మోసం చేసి బైక్‌తో పరారైన కేసులో ఆ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు పురోగతికి సహకరించిన పోలీసు అధికారులను ఈ సందర్భంగా సీఐ అభినందించారు. సమావేశంలో సీసీఎస్‌ పోలీసు అధికారులతో పాటు బలిజిపేట, కొమరాడ, సీతానగరం, పార్వతీపురం రూరల్‌ ఎస్సైలు, సీసీఎస్‌ సిబ్బంది ఉన్నారు.

వివరాలు తెలిపిన రూరల్‌ సీఐ గోవిందరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement