కూటమి నేతలు సూపర్ సిక్స్ అంటూ హామీ ఇచ్చారు.. అన్నివర్గాల ప్రజలకు మోసం ఫిక్స్ చేశారు. ఉద్యోగం వచ్చేవరకు యువతకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు.. 11 నెలలుగా మోసం చేస్తూనే ఉన్నారు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలను ఊడదీస్తున్నారు. మన్యం యువతకు ఉపాధి కల్పించేందుకు గత ప్రభుత్వం నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణను సైతం అటకెక్కించి ఆవేదన మిగిల్చారు. కూటమి పాలనలో స్కిల్ కళాశాల కాస్త కళావిహీనంగా మారడం యువతీయువకులను కలచివేస్తోంది. ఉద్యోగాల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
సీతంపేట:
మన్యం యువతలోని నైపుణ్యాలను సానబెట్టి.. వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కల్పనకు గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో యువశిక్షణ కేంద్రం (వైటీసీ) ఏర్పాటుచేసింది. వందలాది మంది యువతకు వివిధ ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి నిపుణులుగా తీర్చిదిద్దింది. స్వయం ఉపాధితో పాటు వివిధ కంపెనీల్లో ఉద్యోగాల సాధనకు అవసరమైన ప్రోత్సాహం అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శిక్షణ కాస్త నిలిచిపోవడం నిరుద్యోగులను ఆవేదనకు గురిచేస్తోంది. ఏడాది కిందట నిరుద్యోగులతో కళకళలాడిన నైపుణ్యాభివృద్ధి కళాశాల నేడు వెలవెలబోతుంది. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువత స్వయం ఉపాధి సాధనతో పాటు వివిధ కంపెనీల్లో ఉద్యోగాల సాధనకు వీలుగా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేదని, నేడు ఆ పరిస్థితి లేదంటూ నిరుద్యోగులు వాపోతున్నారు. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, నైపుణ్యాబివృద్ధి సంస్థ సంయుక్తంగా ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటీవ్ (ఎఫ్ఓఈ), ఫుడ్ అవుట్లెట్ మేనేజర్ (ఎఫ్ఓఎం) కోర్సులో 30 మంది చొప్పున మొత్తం 60 మంది పురుష, మహిళా అభ్యర్థులకు ఒక్కో బ్యాచ్కు రెండు మూడు విడతలుగా అప్పట్లో శిక్షణ ఇచ్చేవారు. శిక్షణ సర్టిఫికెట్ అందజేసేవారు. సెప్టెంబర్ 2023 నుంచి జనవరి 2025 వరకు 240 మంది శిక్షణ పొందగా సుమారు 170 మంది వివిధ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ైపెసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించుకుని శిక్షణ ఇవ్వడం, ఉపాధి కల్పించడంతో గిరిజన యువతకు మేలు జరిగేది. మూడు నెలల పాటు ఇచ్చే శిక్షణకు దాదాపు రూ.లక్షా 50 వేలు వరకు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించే కోర్సులు నిర్వహించింది. రెండు జతల యూనిఫారాలు, మూడు పూటల భోజన, వసతి సౌకర్యాలు కల్పించింది. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ సరఫరా చేశారు. గత ఐదు నెలలుగా శిక్షణ నిలిచిపోవడంతో స్కిల్ కళాశాల వెలవెలబోవడం నిరుద్యోగ అభ్యర్థులను ఆవేదనకు గురిచేస్తోంది.
న్యూస్రీల్
కానరాని నైపుణ్యాభివృద్ధి శిక్షణ
వెలవెలబోతున్న స్కిల్ కళాశాల
గత వైఎస్సార్సీపీ హయాంలో
ఎఫ్ఓఎం, ఎఫ్ఓఈ వంటి కోర్సుల్లో శిక్షణ
ఉపాధి పొందేలా నైపుణ్యాల పెంపు
ఒక్కో అభ్యర్థికి శిక్షణ కాలంలో
రూ.లక్షా 50 వేల వరకు ఖర్చు
మూడు నెలల కోర్సుల్లో 240 మంది చొప్పున శిక్షణ
ఉచిత భోజన, వసతి సౌకర్యాల కల్పన
ప్రస్తుతం శిక్షణ ఇచ్చేవారు లేక ఆందోళన చెందుతున్న యువత
వర్క్ ఆర్డర్ రావాల్సి ఉంది
వివిధ కోర్సుల శిక్షణకు సంబందించి వర్క్ ఆర్డర్ ట్రైనింగ్ పార్టనర్కు ప్రభు త్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు శిక్షణ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.
– వెంకటరమణ, స్కిల్ కళాశాల సమన్వయకర్త, సీతంపేట
ఎదురు చూస్తున్నాం
డిగ్రీ పూర్తిచేశాను. స్కిల్ కళాశాలలో శిక్షణ కోసం నెలరోజుల కిందట దరఖా స్తు చేశాను. నైపుణ్యం సా ధించి ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సాధించాలని ఉంది. శిక్షణ కోసం ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాలేదు.
– కుప్ప చంద్రశేఖర్, నిరుద్యోగి, బత్తిలి
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025