రెండు బైక్‌లు ఢీ.. యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ.. యువకుడు మృతి

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

రెండు బైక్‌లు ఢీ.. యువకుడు మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

నరసరావుపేట రూరల్‌: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని జొన్నలగడ్డ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. నాదెండ్ల మండలం జంగాలపల్లికి చెందిన మద్ది శ్రీకాంత్‌(24) పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి పట్టణంలో పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమై వస్తుండగా.. జొన్నలగడ్డ చప్టా వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. బస్సును ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నల్లపాడుకు చెందిన వెంకటేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటేష్‌ను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ కిషోర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement