వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో పలువురు నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో పలువురు నియామకం

Sep 21 2025 5:57 AM | Updated on Sep 21 2025 5:57 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో పలువురు నియామకం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో పలువురు నియామకం బాలికను వేధించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు గంజాయి రహిత జిల్లాగా చేయడమే లక్ష్యం శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన జిమ్నాస్టిక్స్‌ జిల్లా టీం ఎంపిక

నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలుగా ఉప్పుతోళ్ల వేణుమాధవ్‌ (నరసరావుపేట), షేక్‌ మాబూహుస్సేన్‌ (సత్తెనపల్లి) నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర మైనార్టీ సెల్‌ సెక్రటరీగా సత్తెనపల్లికి చెందిన షేక్‌జాని (గుంటూరు జాని), స్టేట్‌ సోషల్‌ మీడియా వింగ్‌ సంయుక్త కార్యదర్శిగా తంగిరాల శ్రీనివాసరెడ్డి (మాచర్ల), స్టేట్‌ ఎస్‌సీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా కందుల ఎజ్రా (నరసరావుపేట), స్టేట్‌ వలంటీర్‌ వింగ్‌ సంయుక్త కార్యదర్శిగా పండ్ల మంగయ్య (మాచర్ల) నియమితులయ్యారు.

తాడికొండ: బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తాడికొండ సీఐ సీహెచ్‌.వాసు శనివారం తెలిపారు. తాడికొండకు చెందిన యువతి గుంటూరులోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. గత పది నెలలుగా తాడికొండ గ్రామానికి చెందిన షేక్‌ అస్లామ్‌ యువతి కళాశాలకు వెళుతున్న సమయంలో వెంటబడుతున్నాడు. తనను ప్రేమించాలంటూ బలవంతం చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. యువతి విషయాన్ని కుటుంబ సభ్యలకు తెలిపింది. ఆమె తాతయ్య నిందితుడిని హెచ్చరించాడు. రెచ్చిపోయిన యువకుడు ఫోన్‌ చేసి తన ప్రేమను అంగీకరించకపోతే యువతితో పాటు ఆయన్ను చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వాసు తెలిపారు.

జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

నగరంపాలెం: జిల్లాను గంజాయి రహితంగా చేయడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి క్రయ, విక్రయాలు, సరఫరాపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. గడచిన రెండు రోజుల్లో 3.5 కిలోల గంజాయి సీజ్‌ చేసి, 22 మందిని అరెస్ట్‌ చేశామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు, అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గంజాయి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ప్రత్యేక నిఘాతో పాటు పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని, ఆస్తుల జప్తునకు కూడా చర్యలు చేపడతామని వివరించారు. పోలీస్‌స్టేషన్‌ స్థాయిలోని ప్రత్యేక పోలీస్‌ బృందాలు, ఈగల్‌ బృందాల సమన్వయంతో గంజాయి నిర్మూలిస్తామ డ్రోన్‌ కెమెరాల సాయంతోనూ గుర్తిస్తామని తెలిపారు. జిల్లాలో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.

చేబ్రోలు: భారీ వర్షాలు, వరదలకు మండలంలోని శలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాల్లో నీట మునిగి దెబ్బతిన్న వరి పొలాలను శనివారం వ్యవసాయశాఖాధికారులు పరిశీలించారు. సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘‘రెక్కల కష్టం... వర్షార్పణం’’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా స్థానిక ఏవో పి. ప్రియదర్శిని మాట్లాడుతూ శేకూరు, శలపాడు రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతులు నాలుగు వేల ఎకరాల్లో వరి సాగు చేశారని తెలిపారు. పంట కూడా 30రోజులు పైబడిన దశలో ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉన్న పొలాలను పరిశీలించామని, ప్రాథమిక నివేదికను జిల్లా వ్యవసాయశాఖాధికారికి సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యయసాయశాఖ సిబ్బంది, మైలా రామరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌: బీఆర్‌ స్టేడియంలో శనివారం అండర్‌– 14, అండర్‌– 17, అండర్‌– 19 జిమ్నాస్టిక్స్‌ బాలబాలికల జిల్లా టీం సెలక్షన్లు నిర్వహించారు. అండర్‌– 14, 17 ఎంపికలు ఎస్జీఎఫ్‌ సెక్రటరీ గోపి, అండర్‌ –19 ఎంపికలు నరసింహారావు, కోచ్‌ ఆఫ్రోజ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో జరిగాయి.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో పలువురు నియామకం 1
1/3

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో పలువురు నియామకం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో పలువురు నియామకం 2
2/3

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో పలువురు నియామకం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో పలువురు నియామకం 3
3/3

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో పలువురు నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement