మావోయిస్టుల మృతదేహాలను దహనం చేయటం చట్ట వ్యతిరేకం | - | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల మృతదేహాలను దహనం చేయటం చట్ట వ్యతిరేకం

May 28 2025 11:47 AM | Updated on May 28 2025 11:47 AM

మావోయ

మావోయిస్టుల మృతదేహాలను దహనం చేయటం చట్ట వ్యతిరేకం

వినుకొండ: ఈ నెల 21న చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన 27 మంది మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించకుండా దహనం చేయడం చట్టవ్యతిరేకమని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. మావోయిస్టుల మృతదేహాలను రక్తసంబంధీకులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా చట్టవిరుద్ధంగా వారిని దహనం చేశామని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు వైవీ, జి.రామకృష్ణ, చిన్న, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సాధారణం కంటే

అధిక వర్షపాతం

మేలో సాధారణ వర్షపాతం 1237.3 మి.మీ కురిసింది 2703.8మి.మీ

నరసరావుపేట: జిల్లాలో మే నెల మండు వేసవిలో ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని మించి వర్షం కురిసింది. జిల్లాలో ఈ నెల 1237.3 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సివుండగా మరో నాలుగురోజులు మిగిలి ఉండగానే 2703.8 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 28 మండలాల్లో ఈనెలలో కురిసిన వర్షపాత వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మాచర్లలో 102.4మి.మీటర్లు, వెల్దుర్తిలో 57.0, దుర్గిలో 78,2, రెంటచింతలలో 75,6, గురజాల 82,0, దాచేపలి 51.8, కారంపూడి89.8, పిడుగురాళ్ల 83,6, మాచవరం 46.4, బెల్లంకొండ 119.6, అచ్చంపేట 82.6, క్రోసూరు 68.0, అమరావతి 199.6, పెదకూరపాడు 105.6, సత్తెనపల్లి 146.2, రాజుపాలెం 110.4, నకరికల్లు 34.0, బొల్లాపల్లి 65.4, వినుకొండ 87.0, నూజెండ్ల 71.2, శావల్యాపురం 77.6, ఈపూరు 63.4, రొంపిచర్ల 50.2, నరసరావుపేట 135.4, ముప్పాళ్ల 118.4, నాదెండ్ల 132.6, చిలకలూరిపేట 200.4, యడ్లపాడు 169.4 మి.మీ వర్షం పడింది. ఒక్కో మండలానికి సరాసరిన 96.4 మి.మీటర్ల వర్షం కురిసింది.

రెండు లారీలు ఢీ

ఒకరికి గాయాలు

మేదరమెట్ల: ముందు వెళ్తున్న లారీ రివర్స్‌లో వస్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీ కొన్న సంఘటన మంగళవారం తెల్లవారు జామున మేదరమెట్ల కొండ సమీపంలో జాతీయరహదారిపై చోటు చేసుకుంది. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కంటైనర్‌ లారీ మేదరమెట్ల కొండ సమీపానికి రాగానే ముందు వెళుతున్న లారీ రివర్స్‌లో వెనక్కు వస్తోంది. దీన్ని గమనించని కంటైనర్‌ డ్రైవర్‌ లారీ వెనుకభాగాన్ని బలంగా ఢీ కొన్నాడు. దీంతో కంటైనర్‌ డ్రైవర్‌ దీప్‌కుమార్‌కు గాయాలు కాగా 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్‌కు తరలిచారు. కంటైనర్‌ ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మావోయిస్టుల మృతదేహాలను దహనం చేయటం చట్ట వ్యతిరేకం
1
1/1

మావోయిస్టుల మృతదేహాలను దహనం చేయటం చట్ట వ్యతిరేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement