విద్యార్థులకు రూ.10 లక్షల ప్రైజ్‌ మనీ అందజేత | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు రూ.10 లక్షల ప్రైజ్‌ మనీ అందజేత

Dec 11 2023 2:06 AM | Updated on Dec 11 2023 2:06 AM

- - Sakshi

విజయవంతంగా ‘చలపతి’ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌

తాడికొండ: మోతడక చలపతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం ఐఐటీ, జేఈ ఈ/ నీట్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ ను నిర్వహించారు. 3000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ విజేతకు రూ.1 లక్ష, ద్వితీయ విజేతకు రూ.75వేలు, తృతీ య విజేతకు రూ.50వేలు అందించారు. 4–10 ర్యాంక్‌ల విజేతలకు రూ.20 వేలు, 11–25 ర్యాంక్‌ సాధించిన విజేతలకు రూ.15 వేలు, 26–50 ర్యాంక్‌ విజేతలకు రూ.10 వేలు, 50–100 ర్యాంక్‌ సాధించిన విద్యార్థులకు రూ.5 వేలు చొప్పున ప్రైజ్‌ మనీని అందజేశారు. ఈ సందర్భంగా చలపతి విద్యా సంస్థల చైర్మన్‌ వై.వి.ఆంజనేయులు, సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ వై. సుజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయడమే ధ్యేయంగా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు చెప్పారు. స్కాలర్‌షిప్‌ టెస్ట్‌కు ఎక్కువ మంది జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు హాజరు కావడం మంచి పరిణామమని తెలిపారు. స్కాలర్‌షిప్‌ టెస్ట్‌కు హాజరైన విద్యార్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు కళాశాల తరఫున ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. నాగ కిరణ్‌ కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement