పీఆర్‌టీయూ గౌరవాధ్యక్షుడిగా వెంకటరెడ్డి | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌టీయూ గౌరవాధ్యక్షుడిగా వెంకటరెడ్డి

Dec 11 2023 2:06 AM | Updated on Dec 11 2023 2:06 AM

నూతన కార్యవర్గ ప్రతినిధులను 
అభినందిస్తున్న యూనియన్‌ నాయకులు  - Sakshi

నూతన కార్యవర్గ ప్రతినిధులను అభినందిస్తున్న యూనియన్‌ నాయకులు

నరసరావుపేట ఈస్ట్‌: పల్నాడు జిల్లా ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ (పీఆర్‌టీయూ) గౌరవాధ్యక్షుడిగా కె.వెంకటరెడ్డి (పమిడిమర్రు), వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా షేక్‌.అబ్దుల్‌సత్తార్‌ (సంతగుడిపాడు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన యూనియన్‌ జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఈమేరకు ఎన్నుకున్నారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కె.శ్యామ్‌ మోజెస్‌ అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయుల పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, అక్రమ సస్పెన్షన్‌లు రద్దు చేయాలని సమావేశంలో తీర్మానించారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీవీఎస్‌ మణి, షేక్‌.ఖాజావలి, షేక్‌.రఫీ, జి.అనిల్‌, ఎస్‌.రవీంద్రబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement