సత్తిగూడ ఇకో పార్క్లో
మల్కన్గిరి: మల్కన్గిరి సమితి సత్తిగూడ డ్యామ్ వద్ద అటవీ దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజేశిర్కే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇకో పార్క్లో భాగంగా డ్యామ్లో ప్రత్యేక యాంత్రిక పడవలను ప్రారంభించారు. వన్య ప్రాణుల సంరక్షణ గురించి వివరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి సాయి కిరణ్ డీఎన్, జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, అదనపు అటవీ శాఖ అధికారి ప్రియాంక మహుకా, సత్తిగూడ డ్యామ్ ప్రాజెక్ట్ సహాయ ఇంజినీర్ లలిత్ బెహరా తదితరులు పాల్గొన్నారు.


