
వినాయక చవితి నిర్వహణకు తీర్మానం
రాయగడ: బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తీర్మనించారు. ఈ మేరకు స్థానిక బాలాజీ నగర్లో గల కళ్యాణ వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. సమాజం అధ్యక్షులు రేజేటి శ్రీనివాస్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భాగంగా సమాజంలో వివిధ సేవలను అందిస్తున్న సీనియర్ సభ్యులను ఈ సందర్భంగా సత్కరించేందుకు నిర్ణయించారు. సమాజం కార్యదర్శి భళ్లమూడి నాగరాజు, కళ్యాణవేంకటేశ్వర మందిరం ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, టి.ఎస్.ఆర్.మూర్తి , అవసరాల నారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.