
మూల విరాట్లకు శ్రీముఖ సేవ
భువనేశ్వర్: ఆషాఢ అమావాస్య చతుర్దశి జగన్నాథుని సంస్కృతిలో ప్రత్యేకమైంది. ఇది అనవసర చతుర్దశి కావడం విశేషం. ఈ సందర్భంగా మంగళవారం గోప్య సేవలు అందుకుంటున్న మూల విరాటులకు శ్రీముఖ సేవ నిర్వహించారు. ఏడాది పొడవునా తరచూ ఆలయ గణాంకాల ప్రకారం నిర్వహించే గోప్య సేవల్లో ఇదొకటి. ఏటా ఆషాఢ అమావాస్య తిథి నాడు ఆలయ సంప్రదాయం ప్రకారం బొనొకొ లగ్గి సేవ నిర్వహిస్తారు. స్నాన పూర్ణిమ నాటి భారీ స్నానం తర్వాత దేవతలు జ్వరంతో తెర చాటుకు చేరారు. అమావాస్య నాటికి 14 రోజులు పూర్తి అవుతుంది. ఈ వ్యవధిలో ఆరోగ్యం కోసం పలు విధాలుగా తైల మర్దన, లేపన పూత ఇతరేతర ఆయుర్వేద వైద్య విధానంలో చికిత్సతో మూల విరాటుల ముఖాలు మసకబారాయి. స్వామి ఆరోగ్యం కోలుకోవడంతో తెర చాటు నుంచి భక్తజనం మధ్య ప్రత్యక్షం కానున్నాడు. శ్రీముఖ అలంకరణతో భక్తుల మధ్య స్వామి ప్రత్యక్షమై నేత్రానందం ప్రసాదిస్తాడు. దైతపతి సేవకులు గోప్య సేవల్లో భాగంగా పంచమి నాడు ఫులూరి తైల మర్దన మరియు ఏకాదశి నాడు దశమూలికల మోదక సమర్పణ వంటి వైద్య విధానాల చికిత్సతో నయం చేశారు. పవిత్ర ఒణొసొరొ చతుర్దశి మరియు ఆషాఢ అమావాస్య తిథి పురస్కరించుకుని మంగళవారం శ్రీమందిరంలో చిత్రపటం ప్రతినిథి దేవుళ్లకు బొడొ సింగార ధూపం తర్వాత ఒణొసొరొ పౌరాణికం మరియు చొకొట భోగం నివేదించారు. వెంబడి దత్త మహాపాత్రో సేవకులు ఒణొసొరొ ప్రాంగణంలోనికి ప్రవేశించి శ్రీముఖ అలంకరణ పూర్తి చేశారు. అనంతరం దైతపతులు లోపలికి తదుపరి సేవలు, ఉపచారాలు కొనసాగించారు.

మూల విరాట్లకు శ్రీముఖ సేవ