అమరులైన గిరిపుత్రులకు నివాళులు | - | Sakshi
Sakshi News home page

అమరులైన గిరిపుత్రులకు నివాళులు

Jun 25 2025 1:17 AM | Updated on Jun 25 2025 1:17 AM

అమరులైన గిరిపుత్రులకు నివాళులు

అమరులైన గిరిపుత్రులకు నివాళులు

కొరాపుట్‌: అమరులైన గిరిపుత్రులకు దళిత్‌ సమాజ్‌ నివాళులర్పించింది. మంగళవారం సాయంత్రం నబరంగ్‌పూర్‌ జిల్లా రాయిఘర్‌ సమితి కుమిలి గ్రామ పంచాయతీ జంధర్‌ గ్రామంలో స్మారక స్థూపం వద్ద సంతాపం కార్యక్రమం జరిగింది. 2001 జూన్‌ 24వ తేదీన అక్కడ గిరిజనులు భూ హక్కుల కోసం పోరాటం చేయగా, జరిగిన గొడవల్లో బెంగాలీ శరణార్థుల చేతిలో బన్‌సింగ్‌ గోండో, అయితర్‌ రవుత్‌ అనే గిరిజనులు మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి భూ హక్కుల కోసం దళిత్‌ సమాజ్‌ ఆవిర్భవించింది. దళిత్‌ సమాజ్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యే సుభాష్‌ గోండో, సుఖదేవ్‌ గోండో తదితరులు హాజరై నివాళుర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement