
● క్రీడాకారులకు సత్కారం
భువనేశ్వర్: జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ ప్రత్యేక నగదు పురస్కారంతో మంగళవారం సత్కరించారు. 2025 ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆసియా ఛాంపియన్ షిప్ పోటీల్లో సీనియర్ మహిళా వాల్ట్లో కాంస్య పతకం సాధించిన జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ను రూ.75,000లు, 38వ 9 ఏళ్లలోపు చదరంగం ఛాంపియన్ షిప్ – 2025 పోటీలో విజేతగా నిలిచిన బాల క్రీడాకారుడు సాత్విక్ స్వంయికి రూ.30,000ల నగదు బహుమతి అందజేసి అభినందనలు తెలిపారు.

● క్రీడాకారులకు సత్కారం