
జవానుల బలి దానాలు జాతి మరువదు
కొరాపుట్: జవానుల బలి దానాలు జాతి మరువదని ఒడియా సినీ హీరో, గంజాం జిల్లా దిగపొండి ఎమ్మెల్యే సిద్దాంత్ మహాపాత్రో అన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని బీఎస్ఎఫ్ సెక్టర్ హెడ్ క్వార్టర్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జవానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కరువవ్వడంతో అలజడులతో ఉండేదని గుర్తు చేసుకున్నారు. అయితే బీఎస్ఎఫ్ జవానుల రాకతో శాంతి వాతావరణం ప్రారంభమయ్యిందని పేర్కొన్నారు. సమాజ పరిరక్షణలో జవానులు చేసిన బలి దానాలు జాతి గుండెల్లో నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం విధి నిర్వహణలో అమరులైన బీఎస్ఎఫ్ జవానులకు అంజలి ఘటించారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ డీఐజీ సత్యవాన్ ఖంచి తదితరులు పాల్గొన్నారు.

జవానుల బలి దానాలు జాతి మరువదు