
ముక్కు మూసుకొని నడవాల్సిందే..
కొరాపుట్: జయపూర్ పట్టణంలోని 20, 21 వార్డుల్లో అపారిశుద్ధ్యం విలయతాండవం చేస్తోంది. ఎక్కడచూసిన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో చెత్తపై వర్షం పడుతుండడం వలన దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపారిశుద్ధ్యం వలన దోమలు, ఈగల బెడద పెరిగి రోగాలబారిన పడతామని ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతినెలా సు మారు రు.73 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ వ్య యానికి తగ్గ ఫలితం ఉండడం లేదు. వర్షాలు పడుతుండడంతో డ్రైన్లు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నా యి. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ముక్కు మూసుకొని నడవాల్సిందే..