
నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష
రాయగడ: ఒక మొబైల్ చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను మూడేళ్ల జైలు శిక్షను విధించారు. అదేవిధంగా మరో రూ.10 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. చెల్లించని పక్షంలో అదనంగా మరో 6 నెలలు జైలు శిక్షను అనుభవించాలని వివరించారు. వివరాల్లోకి వెళ్తే.. 2024 అక్టోబర్ 22వ తేదీన ఆర్యన్కుమార్ శర్మ, మరో వ్యక్తి జిల్లాలోని శశిఖాల్ పోలీస్స్టేషన్ క్యాంప్ హౌస్లో నిద్రించారు. ఆ సమయంలో కొంతమంది దుండగులు 3 సెల్ఫోన్లు దొంగిలించారు. దీనికి సంబంధించి శశిఖాల్ పోలీసుస్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అక్షయ నాగ్, మోహన్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించి విచారించిన ఎస్డీజేఎం దాస్ ఐదుగురు సాక్షులను విచారించిన అనంతరం నిందితులకు శిక్షను ఖరారు చేశారు.
తనిఖీలు ముమ్మరం
భువనేశ్వర్: రథయాత్ర సందర్భంగా పూరీ పట్టణ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా బాంబు పేలుడు తదితర విధ్వంస నిరోధక తనిఖీలు చేపడుతున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండు, సాగర తీరం, వసతి సముదాయాలు, యాత్ర ప్రాంగణాలు తదితర కీలక జన సందోహిత ప్రదేశాల్లో పూరీ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
● మర్యాదపూర్వక భేటీ
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వీరివురు రాష్ట్ర పాలన, అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సుసంపన్న ఒడిశా ఆవిష్కరణ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాచరణను గవర్నర్కు వివరించినట్లు సీఎం తెలిపారు. – భువనేశ్వర్

నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష