
బీజేపీ మాక్ పార్లమెంట్
కొరాపుట్: దేశంలో ఎమర్జెన్సీ పాలనని గుర్తు చేస్తూ జయపూర్ పట్టణంలోని పారాబెడా సెంటర్లో ఉన్న బాలకృష్ణ ప్యాలెస్లో బీజేపీ యువ మోర్చా విభాగం మాక్ పార్లమెంట్ మంగళవారం ఏర్పాటు చేసింది. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయినందున నాటి అరాచకాలు నేటి యువతరానికి తెలియాలనే ఉద్దేశంతో మాక్ పార్లమెంట్ నిర్వహించామని ఒడియా సినీ హీరో, గంజాం జిల్లా దిగపొండి ఎమ్మెల్యే సిద్దాంత్ మహాపాత్రో తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ, ప్రాథమిక విద్యామంత్రి నిత్యానంద గోండో దేశ ప్రధాని హోదాలో విద్యార్థుల ప్రశ్నలకు బదులిచ్చారు. కార్యక్రమంలో నబరంగ్పూర్ ఎంపీ బలభద్ర మజ్జి, ఎమ్మెల్యేలు రఘురాం మచ్చో (కొరాపుట్), రుపుదర్ బోత్ర (కోట్పాడ్), పార్టీ నాయకులు గౌతం శాంత్ర, బిశ్వ త్రిపాఠి, అభిలాష్ పండా, పార్వతి తదితరులు పాల్గొన్నారు.