
రైతుల ఆందోళన
కొరాపుట్: పట్టణంలో జాతీయ రహదారి 26పై జిల్లా కేంద్ర ఆస్పత్రి సమీపంలో ఆర్ఎంసీ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకి దిగారు. ధాన్యాన్ని చిన్న వాహనాలతో తీసుకొస్తున్నారని వాటిని తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. ధాన్యంను పెద్ద లారీల్లో తీసుకు రావాలని సూచించారు. లేకుంటే తమకు అదనపు పనిభారం పడుతోందని అధికారులు చెప్పారు. దీంతో రైతులు తమకు పెద్ద వాహనాలు లభ్యమవ్వడం లేదని వివరించారు. అయినప్పటికీ ధాన్యం తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన రైతుల రోడ్డుకి అడ్డంగా బైఠాయించారు. రైతుల ఆకస్మిక ఆందోళనతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఇలా ముందస్తు ప్రకటన లేకుండా వాహనదారులను ఇబ్బంది పెట్టవద్దని ప్రజలు రైతులను విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి అభ్యర్థనలు పెరగడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇది తెలిసిన జిల్లాస్థాయి ఉన్నతాధికారులు వెంటనే రైతుల ధాన్యం తీసుకోవాలని ఆదేశించారు.

రైతుల ఆందోళన