
రథయాత్ర ఏర్పాట్లు పరిశీలన
కొరాపుట్: ఆంధ్రా – ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాలో రథయాత్ర ఏర్పాట్లను కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ పరిశీలించారు. మంగళవారం పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీలో పర్యటించారు.
విశ్వవ్యాప్త రథయాత్ర ఈనెల 27న జరగనుంది. కానీ కొఠియాలో ఒక రోజు ఆలస్యంగా 28న జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంత సమస్య దృష్ట్యా ఇక్కడ రథయాత్రకి ప్రభుత్వమే అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. కలెక్టర్ నిర్మితమవుతున్న రథాన్ని పరిశీలించారు. ఆరోజు ప్రభుత్వం తరుపున అన్ని శాఖల అధికార యంత్రాంగం యాత్ర వద్ద మెహరించాలని ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అనంతరం కొఠియాలోని సాంఘిక సంక్షేమ పాఠశాల, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించారు.

రథయాత్ర ఏర్పాట్లు పరిశీలన