
బాధ్యతల స్వీకరణ
మల్కన్గిరి: జిల్లా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్వో)గా సాయి కిరణ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న వన మహోత్సవ వారోత్సవాల్లో అనేక ఔషధ మొక్కలు నాటుతామని తెలియజేశారు. కార్యక్ర మంలో అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకు మహా ప్రదర్శన
కొరాపుట్: రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ మహా ప్రదర్శన చేస్తుందని జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణిపతి ప్రకటించారు. మంగళవారం జయపూర్ మెయిన్ రోడ్డులోని బంకు మఠం సమీపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29వ తేదీన జయపూర్ పట్టణంలోని పారాబెడలో ఉన్న దసరా పొడియా అందుకు వేదిక కానుందన్నారు. కలహండి జిల్లా మీదుగా పీసీసీ ప్రెసిడెంట్ భక్త చరణ్ దాస్ వస్తారన్నారు. నబరంగ్పూర్ జిల్లా నుంచి అన్నిచోట్ల మెటార్ బైక్లు అనుసరించి జయపూర్ చేరేసరికి 5,000 బైక్ల ర్యాలీ జరుగుతుందన్నారు. కొరాపుట్, మల్కన్గిరి, నబరంగ్పూర్ జిల్లాల నుంచి సుమారు 40 వేల మందితో సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు అజయ్ కుమార్ లల్లూ, రాష్ట్ర వ్యాప్త కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని ప్రకటించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు పవిత్ర శాంత (లక్ష్మీపూర్), మంగులు కిలో (చిత్రకొండ), మున్సిపల్ చైర్మన్లు నొరి మహంతి, శంకరరావు తదితరులు ఉన్నారు.
శ్రీముఖలింగం హుండీ ఆదాయం రూ.3.32 లక్షలు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో గడిచిన 112 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.3,32,883 వచ్చినట్లు ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు మంగళవారం తెలిపా రు. పర్యవేక్షణ అధికారి ఆమదాలవలస గ్రూప్ టెంపుల్ అధికారి టి.రవితోపాటు కొమనాపల్లి సత్యసాయి భజన మండలి అధ్యక్షులు పైడి శెట్టి వెంకటరమణ, అర్చకులు వెంకటాచలం,ధనాల స్వామి,భక్తులు పాల్గొన్నారు.
డిగ్రీ 2, 4 సెమిస్టర్ల స్పెషల్ డ్రైవ్ పరీక్షలు ప్రారంభం
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో 2015–18 విద్యా సంవత్సరంలో సీబీఎస్ విధానంలో చదివి డిగ్రీ పూర్తి చేయలేకపోయిన వారికి, 2019లో డిగ్రీలో చేరి ఏవైనా సబ్జెక్ట్లు ఉండిపోయిన సప్లిమెంటరీ విద్యార్థులకు సంబంధించి రెండు, నాలుగు స్పెషల్డ్రైవ్ పరీక్షలను మంగళవారం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రతి రోజు జరిగే ఈ పరీక్షలు వచ్చే నెల 7వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పరీక్షలను రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య పరిశీలించారు.
జూలై 5న జాతీయ లోక్ అదాలత్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జూలై 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని, ఇందులో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కోర్టు భవనంలో పోలీస్ అధికారులు, ఎకై ్సజ్ అధికారులు, బీమా న్యాయవాదులు, చిట్ఫండ్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసారి కూడా ఎక్కువ కేసులు పోలీసు వారి దగ్గర నుంచి రావాలని కోరారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కర రావు, 3 వ అదనపు జిల్లా జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్, 4 వ అదనపు జిల్లా జడ్జి ఎస్ ఎం ఫణి కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ