
పంగం నది ఒడ్డున మృతదేహం
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి కధంగూఢ పంచాయతీ గరియగూఢ గ్రామం వద్ద పంగం నది ఒడ్డున ఆదివారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు చూసి వెంటనే మత్తిలి పోలీసులకు సమాచారం అందజేశారు. మత్తిలి ఐఐసీ దీపాంజాలీ ప్రధాన్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహన్ని బయటకు తీసి పరిశీలించగా సాయంత్రానికి ఆమె వివరాలు తెలిశాయి. మృతురాలిని ఖోయిర్పూట్ సమితి ముదిలిపోడ పంచాయతీ కరాడబడే గ్రామానికి చెందిన బిమాల ఖోర (47)గా గుర్తించారు. ఆమె కుమారుడు గోవింధ ఖోరకు విషయం తెలిసిన వెంటనే మత్తిలి పోలీస్స్టేషన్కు వచ్చి తన తల్లి మానసికంగా ఇబ్బంది పడుతోందని, అప్పుడప్పుడూ బయటకు వెళ్లిపోతూ ఉంటుందని, రెండు రోజులుగా వెతుకుతున్నామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు ఐఐసీ తెలిపారు.