ఐఐటీలో సదస్సు రేపు | - | Sakshi
Sakshi News home page

ఐఐటీలో సదస్సు రేపు

May 27 2025 12:41 AM | Updated on May 27 2025 12:41 AM

ఐఐటీల

ఐఐటీలో సదస్సు రేపు

భువనేశ్వర్‌: స్థానిక ఐఐటీలో ఆరోగ్యం, పరిశుభ్రతపై మార్గదర్శక సదస్సును బుధవారం నిర్వహించనున్నారు. క్యాంపస్‌ ఆడిటోరియంలో సదస్సు జరుగుతుందని అధికారులు సోమ వారం ప్రకటించారు. యూనిసెఫ్‌, ఆయురారో గ్య సౌఖ్యం ఫౌండేషన్‌, యాక్షన్‌ ల్యాబ్‌ 2050 ఫౌండేషన్‌, ఒడిశా రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రత అలయన్స్‌ సహకారంతో ఐఐటీ భువనేశ్వర్‌ రీసెర్చ్‌– ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ పార్క్‌ ‘ప్రా జెక్ట్‌ పీరియడ్‌, శానిటేషన్‌, హెల్త్‌ – హైజీన్‌, అండ్‌ ఎన్విరామెంట్‌ (షీ)’ చొరవ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు.

వలస కార్మికుని మృతి

రాయగడ: ఉపాధిని వెతుక్కుంటూ వలస వెళ్లిన కార్మికుడు మృతి చెందాడు. జిల్లాలోని చంద్రపూర్‌ సమితి డంగసొరొడ పంచాయతీలోని జుడింగి గ్రామానికి చెందిన బులు బెడ్రక (19) గత ఏడాది డిసెంబర్‌ నెలలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ని శ్రీకాకుళంలో ఓ నర్సరీలో పనికి కుదిరాడు. కొద్ది నెలల తరువాత శ్రీకాకుళం నుంచి బెంగళూరులోని మరో నర్సరీకి వెళ్లాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన బెడ్రక శనివారం మృతి చెందినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి ఆదివారం నాడు తీసుకువచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు.

యువకుని ఆత్మహత్య

రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లోని కొచొరా వీధిలొ అక్షయనాగ్‌ (18) అనే యువ కుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఆదివారం సాయంత్రం తన గది తలుపులు వేసుకుని ఉన్న అక్షయ్‌ను తండ్రి రా మనాగ్‌ పిలిచినా ఎంతకీ బయటకు రాలేదు. దీంతో అనుమానించి తలుపులు విరగ్గొట్టి గది లోపలకు వెళ్లి చూడగా ప్లాస్టిక్‌ తాడు సహాయంతొ ఉరి వేసుకుని ఉన్న అక్షయ్‌ మృతదేహాన్ని చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నమ్మించి.. నట్టేట ముంచి..!

పెళ్లి చేసుకొని దళిత యువతికి మోసం

ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

శ్రీకాకుళం క్రైమ్‌: ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడని.. తనతో ఒక బిడ్డను కన్నాక దళిత మహిళ అని ఒకే ఒక్క కారణంతో తనను వదిలించుకోవాలని చూసి, అంతకుముందే నిశ్చితార్థం చేసుకున్న మరో అమ్మాయితో పరారయ్యాడని ఒక బాధితురాలు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు యర్ర మంగ మ్మ ఇచ్చిన ఫిర్యాదులో మేరకు.. ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన తనని 2019లో లావేరు మండలం శిగిరి కొత్తపల్లి గ్రామానికి చెందిన యర్ర శంకరరావు ప్రేమిస్తునానని చెప్పి హైదరాబాద్‌ తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో మగబిడ్డను కన్నా క తనది దళిత కులమనే ఒక్క కారణంతో అయిష్టత పెంచుకుని హింసించడం ప్రారంభించాడు. దానికి శంకరరావు కుటుంబ సభ్యు లు అతనికి మద్దతు పలికేవారు. కొన్నిరోజులు మళ్లీ ప్రేమను చూపించి హైదరాబాద్‌ నుంచి శిగిరి కొత్తపల్లి గ్రామంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు. పైడి భీమవరం ఫార్మా కంపెనీలో డ్యూటీ చేసేందుకు అక్కడే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని విధులకు వెళ్లేవాడు.

మరో అమ్మాయితో పరారీ

తన భర్త శంకరరావును పైడి భీమవరం నుంచి తమ ఇంటికి తీసుకెళ్లమని ఎన్నిసార్లు చెప్పినా తీసుకెళ్లేవాడు కాదని మహిళ పేర్కొంది. కార ణం అడిగితే తన తల్లిదండ్రులు, అన్నదమ్ము లు దళిత మహిళను తీసుకురావడానికి వీళ్లేదని కుల పెద్దల సమక్షంలో తేల్చి చెప్పారని సమాధానమిచ్చాడని తెలిపింది. అంతేకాక అంతకు ముందు తన భర్తతో నిశ్చితార్థం జరిగిన దుర్గలక్ష్మి అనే అమ్మాయితో ఎటైనా వెళ్లిపోమని కుటుంబసభ్యులు సలహా ఇవ్వడంతో ఆమెతో కలిసి పరారయ్యాడని పేర్కొంది. ఇదే విషయ మై లావేరు పోలీసులకు నెల రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు పట్టించుకోలేదని, న్యాయం చేయమని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని ప్రాధేయపడింది.

ఐఐటీలో సదస్సు రేపు 1
1/2

ఐఐటీలో సదస్సు రేపు

ఐఐటీలో సదస్సు రేపు 2
2/2

ఐఐటీలో సదస్సు రేపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement