బ్యాంకు మాజీ ఉద్యోగి ఇంటిలో దొంగతనం | - | Sakshi
Sakshi News home page

బ్యాంకు మాజీ ఉద్యోగి ఇంటిలో దొంగతనం

May 27 2025 12:41 AM | Updated on May 27 2025 12:41 AM

బ్యాం

బ్యాంకు మాజీ ఉద్యోగి ఇంటిలో దొంగతనం

కొరాపుట్‌: జయపూర్‌ పట్టణంలోని ఎక్టాగుడ ప్రాంతంలో షిర్డీ సాయినగర్‌ 2వ లైన్‌లో కేసీసీ బ్యాంక్‌ మాజీ ఉద్యోగి అతుల్య మాలిక్‌ నివాసంలో సోమవారం దొంగలు పడ్డారు. అర్ధరాత్రి తమ సమీప బంధువు మృతి చెందాడని తెలిసి 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులంతా పేపర్‌ మిల్‌ ప్రాంతానికి వెళ్లారు. తిరిగి ఉదయం 6 గంటలకు ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం సావిత్రి అమావాస్య నేపథ్యంలో బ్యాంకు లాకర్‌లో ఉన్న బంగారం ఇంటికి తెచ్చారు. దొంగలు ఆ బంగారంతో పాటు ఇంటిలో ఉన్న నగదు పట్టుకుని వెళ్లిపోయారు. ఈ ఇంటిలో సీసీ కెమెరాలు ఉండడంతో దొంగలు ముఖాలపై తువ్వాళ్లు కట్టుకుని వచ్చినట్లు గుర్తించారు. సుమారు 30 తులాల బంగారం, 80 వేల నగదు దొంగలు తీసుకెళ్లారని బాధితులు తెలిపారు. తెలిసిన వెంటనే కేసీసీ బ్యాంక్‌ అధ్యక్షుడు ఈశ్వర్‌ చంద్ర పాణిగ్రాహీ బాధిత కుటుంబం ఇంటికి వచ్చి పరామర్శించారు.

బ్యాంకు మాజీ ఉద్యోగి ఇంటిలో దొంగతనం 1
1/1

బ్యాంకు మాజీ ఉద్యోగి ఇంటిలో దొంగతనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement