
పిల్లలను ఆస్పత్రిలో వదిలేసిన తండ్రి!
● పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
రాయగడ: తన ముగ్గురు పిల్లలను ఆస్పత్రిలో విడిచి పరారైన తండ్రి ఉదంతం వెలుగు చూసింది. జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలను ఆస్పత్రిలో విడిచి వెళ్లిన తండ్రి ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్లో ఆస్పత్రి వర్గాలు ఫిర్యా దు చేశారు. పర్శలి పంచాయతీ పరిధిలోని పరమాలి గ్రామానికి చెందిన సీతా కడ్రక అనే డొంగిరియా తెగకు చెందిన వ్యక్తి తన దివ్యాంగుడైన ఆరేళ్ల కొడుకు బిజు కడ్రక ఆరోగ్యం బా గొలేదని కళ్యాణసింగుపూర్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువచ్చాడు. బిజుతో పాటు తన మరో 4, 5 ఏళ్ల ఇద్దరు కొడుకులను కూడా తన తో తీసుకువెళ్లిన సీత చికిత్స అనంతరం తన పెద్ద కొడుకు బిజును ఆస్పత్రిలో చేర్పించాడు. కొద్ది సేపటి తరువాత తన ముగ్గురు పిల్లలను అక్కడే విడిచి ఎక్కడకు వెళ్లిపొయాతో తెలియక ఆస్పత్రి వర్గాలు వేతికారు. కాని ఎంతకీ ఆచూకీ తెలియకపొవడంతో కళ్యాణ సింగుపూర్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రొ, సిబ్బంది ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పర్శాలి సమితి సభ్యులు బికాష్ బాగ్ సహకారంతో కల్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ ఐఐసీ నీలకంఠ బెహర తన వాహనంలో ముగ్గురు పిల్లలను పరమాలి గ్రామానికి తీసుకువెళ్లి కుటుంబీకులకు అప్పగించారు.

పిల్లలను ఆస్పత్రిలో వదిలేసిన తండ్రి!