భక్తిశ్రద్ధలతో సావిత్రి అమావాస్య | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో సావిత్రి అమావాస్య

May 27 2025 12:41 AM | Updated on May 27 2025 12:41 AM

భక్తిశ్రద్ధలతో సావిత్రి అమావాస్య

భక్తిశ్రద్ధలతో సావిత్రి అమావాస్య

రాయగడ: సావిత్రి అమావాస్య పూజలు సోమవా రం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. స్థానిక జగన్నాథ మందిరం, రాధాకాంత మందిరాల్లో మహిళలు పూజలు చేశారు. అమ్మవారికి పండ్లు, గాజులు, చీర సమర్పించారు.

కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాల్లో

కొరాపుట్‌: కొరాపుట్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాల్లో సావి త్రి అమావస్య పూజలు చేపట్టారు. సోమవారం ఉదయం నుంచే మహిళలు సావిత్రి దేవిని కొలిచా రు. పుట్టింటి వారి శాంతి, మెట్టింటి వారి ఉన్నతి కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో కిన్నెరలు సావిత్రి అమావస్య పూజల్లో పాల్గొన్నారు.

పర్లాకిమిడిలో..

పర్లాకిమిడి: సావిత్రి అమావాస్య సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. పసుపు, కుంకుమలు చల్లగా ఉండాలని పూజించారు. సావిత్రి దేవికి గాజులు, పసుపు కుంకుమలు కానుకగా అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. గుసాని సమితి జాజిపురం గ్రామంలో కిన్నెరలు పెద్ద ఎత్తున పూజలు చేశారు. ముత్తయిదవులకు కిన్నెరలు ఆశీర్వాదం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement