
జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపిక
పర్లాకిమిడి: న్యూఢిల్లీలో ఏప్రిల్ 30 నుంచి మే 5 వరకూ జరగనున్న జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు కాశీనగర్ సమితి సిధ్ధమణుగు గ్రామానికి చెందిన పలకల కార్తీక్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఇండియా (యస్.జి.ఎఫ్.ఐ.)భువనేశ్వర్ టీంకు ప్రాతినిధ్యం వహించనున్నట్టు జిల్లా శారీరక క్రీడాఽధికారి సురేంద్ర పాత్రో తెలియజేశారు. గజపతి జిల్లా రోలర్ స్కేటింగ్ అకాడెమీ (జి.డి.యస్.ఎ.)లో కార్తీక్ ఏడాదిన్నరగా శిక్షణ పొందాడు. గత ఏడాది నవంబరు 26, 27లో భువనేఽశ్వర్లో జరిగిన రాష్ట్ర స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో పాల్గొని అర్హత సాధించాడు.