
కనువిందు చేస్తున్న చెంగల్వ పూలు
ఎల్ఎన్ పేట: మండలంలోని మురగడలోవ గిరిజన గ్రామంలో ఈ ఏడాది ముందే పూతకు వచ్చిన చెంగల్వ పూలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఏటా మే నెలలో పూతకు వచ్చే చెంగల్వ పూలు ఈ ఏడాది ఏప్రిల్లోనే విరబూశాయి. అరుదుగా కనిపించే చెంగల్వ పూల మొక్కకు చెందిన దుంపలు భూమిలో ఉంటాయి. దుంప నుంచి కాడలా పెరిగిన మొక్క ఒక్కో కాడ నుంచి అనేక పూలు పూస్తుందని గిరిజనులు సవర చిరంజీవి, సవర సింహాచలం తెలిపారు.
ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకుందాం
గార: ప్రాచీన వారసత్వ సంపదలను కాపాడుకుందామని ఇంటాక్ బృందం కన్వీనర్ నూక సన్యాసిరావు, అదనపు కన్వీనర్ వావిలపల్లి జగన్నాథనాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హెరిటేజ్ వాక్ పేరిట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో పర్యటించారు. షేర్ మహమ్మద్ ఖాన్ పాలనా కాలంలో అతిపెద్ద మెట్ల బావి నిర్మాణం చేశారన్నారు. గ్రామస్తులతో అడగి పలు వివరాలు తెలుసుకున్నారు. 25 ఏళ్ల కిందటి వరకు ఈ బావి నీరు తాగడానికి వాడేవారమని గ్రామస్తులు తెలి పారు. అప్పట్లో నిర్మించిన పురాతన భవనాలు కూడా ఇప్పటీకీ చెక్కుచెదురుకుండా ఉండటాన్ని గుర్తించారు. ఈ భవనాలను, బావిని పర్యాటక కేంద్రంగా మలచడానికి అవకాశం ఉందని బృంద సభ్యులు అభిప్రాయపడ్డారు. పరిశీలనలో ఇంటాక్ మెంబర్లు కొమ్ము రమణమూర్తి, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, పొన్నాడ రవికుమార్, తర్లాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
డీలర్ కుటుంబంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ రమణమ్మ కుటుంబంపై దాడి చేసిన వారిపై శుక్రవారం లావేరు పోలీసులు కేసు నమోదుచేశారు. డీలర్ రమణమ్మ రిమ్స్లో ఎంఎల్సీకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోర పారోతి, పరపతి రాము, రమణమ్మ, గాలి రమణ, బోర అసిరినా యుడు, వాకాడ గణేష్, బోర గణేష్, దుర్గారావు, హరీష్లపై కేసు నమోదు చేశారు.
పిడుగుపాటుకు
విద్యుత్ ఉపకరణాలు ధ్వంసం
కంచిలి: మండలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పిడుగులతో కూడిన వర్షానికి పలు గ్రామాల్లో విద్యుత్ ఉపకరణాలు ధ్వంసమయ్యాయి. మండలంలోని గోకర్ణపురం పంచాయతీ పరిధి గోకర్ణపురం, జె.నారాయణపురం గ్రామాల సమీపంలో పడిన పిడుగుల ధాటికి పలు ఇళ్లల్లో విద్యుత్ ఉపకరణాలు పాడయ్యాయి. జె.నారాయణపురం గ్రామానికి చెందిన శ్రీ సిద్ధభైరవి కేబుల్ నెట్వర్క్ పరిధిలో ఆపరేటింగ్ సిస్టంలో ట్రాన్స్మీటర్, సెటాఫ్ బాక్సులు, ఎల్ఈటీ టీవీ తదితర పరికరాలు పాడయ్యాయని యజమాని రత్నాల డొంబురు తెలిపారు. గ్రామంలో రత్నాల గురునాథం, సీర దమయంతి, సీర పార్వతి, యారడి దీనబంధు, డి.హిమావతి తదితరుల ఇళ్లల్లో సెటాఫ్ బాక్సులతోపాటు విద్యుత్ ఉపకరణాలు పిడుగుపాటుకు కాలిపోయాయి.
పిడుగు పాటుకు మూగజీవి మృత్యువాత
వజ్రపుకొత్తూరు రూరల్: మండలం గరుడబద్ర పంచాయతీ పరిధిలోని గల మర్రిపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిడుగు పడి ఆవు మృత్యువాత పడింది.

కనువిందు చేస్తున్న చెంగల్వ పూలు