దేశంలో నీట్ పరీక్ష పేరుతో స్కామ్లు పదేపదే పునరా వృతం అవుతున్నాయి. విద్యార్థుల శ్రమను రూ.లక్షలకు అమ్ముకోవటం దుర్మార్గం. ఈ స్కామ్ల వల్ల రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారు. వైద్య విద్యకు దూరమవుతున్నారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో గెస్ పేపర్ పేరుతో సోషల్ మీడియాలో తిరిగిన ప్రశ్నపత్రం అసలు ప్రశ్నపత్రంతో సరిపోలింది. దీనికి బాధ్యత వహిస్తున్న కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. నీట్ను పూర్తిగా రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించాలి.
– ఎ.సురేష్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్ఓ


