బెయిల్‌ షరతుల సడలింపు పిటిషన్‌పై విచారణ వాయిదా | - | Sakshi
Sakshi News home page

బెయిల్‌ షరతుల సడలింపు పిటిషన్‌పై విచారణ వాయిదా

Jan 21 2026 7:37 AM | Updated on Jan 21 2026 7:37 AM

బెయిల్‌ షరతుల సడలింపు పిటిషన్‌పై విచారణ వాయిదా

బెయిల్‌ షరతుల సడలింపు పిటిషన్‌పై విచారణ వాయిదా

బెయిల్‌ షరతుల సడలింపు పిటిషన్‌పై విచారణ వాయిదా విజయవాడ లీగల్‌: పార్లమెంట్‌లో ఈ నెల 20న జరిగే ఫైనాన్స్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో, అలాగే 26న జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు వైఎస్సార్‌ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ షరతుల సడలింపు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో మంగళవారం ప్రాసిక్యూషన్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైద్యం చేయించుకునేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు పూర్తవగా, తీర్పు బుధవారానికి వాయిదా పడింది. అలాగే ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న అనిల్‌చోఖ్రా, రోణక్‌కుమార్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై ప్రాసిక్యూషన్‌ మంగళవారం కౌంటర్‌ దాఖలు చేయగా, విచారణను న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. మరింత సమాచారం రాబట్టేందుకు సిట్‌ అధికారులు వీరిద్దరినీ కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగ్గా, రోణక్‌ కుమార్‌ను మూడు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనిల్‌ చోఖ్రాపై ఇప్పటికే చార్జిషీట్‌ దాఖలు చేసినందున అవసరం మేరకు ఒకరోజు జైలులోనే విచారించాలని పేర్కొన్నారు. కట్టుదిట్టంగా ఇంటర్‌ పరీక్షలు

డీఆర్వో చంద్రశేఖరరావు

మచిలీపట్నంటౌన్‌:జిల్లాలో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షలు మూడు దశల్లో ఉంటాయని చెప్పారు. జిల్లాలో సాధారణ ప్రాక్టికల్‌ పరీక్షల కోసం 84 పరీక్షా కేంద్రాలు, వృత్తి విద్య ప్రాక్టికల్‌ పరీక్షల కోసం 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వృక్ష ,జంతు, భౌతిక, రసాయన శాస్త్రాల పరీక్షలకు సంబంధించి మొత్తం 27,161 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. వృత్తి విద్య ప్రాక్టికల్‌ పరీక్షలకు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 1,868 మంది పరీక్షలకు కానున్నారన్నారు. ఇంటర్మీడియెట్‌ థియరీ పబ్లిక్‌ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి నెల 23వ తేదీ నుంచి మార్చి నెల 24వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని వివరించారు. ఈ థియరీ పరీక్షలు జిల్లాలోని 63 కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరీక్షలకు మొదటి రెండు సంవత్సరాలకు కలిపి మొత్తం 49,579 మంది హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కంట్రోల్‌ విభాగాన్ని మచిలీపట్నంలోని నోబుల్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వీవీ నాయుడు, పరీక్షల కన్వీనర్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి సరళకుమారి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement