కృష్ణానదిలోకి దూకి మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలోకి దూకి మహిళ ఆత్మహత్య

Aug 24 2025 2:06 PM | Updated on Aug 24 2025 2:06 PM

కృష్ణ

కృష్ణానదిలోకి దూకి మహిళ ఆత్మహత్య

తాడేపల్లి రూరల్‌: గుంటూరు జిల్లా తాడేపల్లి సీతా నగరం పరిధిలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ మహిళ కృష్ణానదిలోకి దూకి ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం ఘాట్‌ వద్దకు శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విజయభార్గవి (28) అనే మహిళ తన కుమార్తె అనేక్యతో కలసి వచ్చింది. భార్గవి కృష్ణానదిలోకి దూకడంతో స్థానికులు గమనించి సమాచారం అందించారని తెలిపారు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పాప తన తండ్రి పేరు నరేష్‌ అని మాత్రమే చెబుతోందని, ఊరు పేరు చెప్పలేకపోయిందని తెలిపారు. ఎవరిౖకైనా వివరాలు తెలిస్తే తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ ఫోను నంబర్లు 86888 31361, 81438 73409, 97034 52206లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌ పేర్కొన్నారు. అనేక్యను విజయవాడలో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు.

కృష్ణానదిలోకి దూకి  మహిళ ఆత్మహత్య 1
1/1

కృష్ణానదిలోకి దూకి మహిళ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement