వేల్పూర్(బాల్కొండ) : బాల్కొండ కమ్యూ నిటీ హెల్త్ సెంటర్లో త్వరలో పూర్తిస్థాయి వైద్యసేవలు అందించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త శ్రీనివాస్ప్రసాద్ పే ర్కొన్నారు. బాల్కొండ సీహెచ్సీని అసిస్టెంట్ డైరెక్టర్ విజయభాస్కర్రెడ్డి, సూపరింటెండెంట్ అరవింద్తో కలిసి గురువారం శ్రీని వాస్ప్రసాద్ సందర్శించారు. ఆస్పత్రిలో ఉ న్న సౌకర్యాలు, ఎక్విప్మెంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి జనరల్ ఫిజిషియన్, సర్జన్, సీ్త్ర వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్యుడు, దంత వైద్యుడిని నియమించామన్నారు. అ లాగే పోస్టుమార్టం సేవలను దసరా నాటికి పునరుద్ధరిస్తామన్నారు. పోస్టుమార్టం కోసం అవసరమైన మరమ్మతులను ఆస్పత్రి ఆవర ణలో చేయించేందకు సర్పంచ్ రాజేశ్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రెండు వారాల త ర్వాత తిరిగి ఆస్పత్రిని పరిశీలిస్తామన్నారు. వైద్యులు వినీశా, రవళి, వినోద్, సతీశ్, నవ నీత్, బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేశ్, ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్, వార్డు సభ్యుడు సందీప్, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.


