బైక్‌ అదుపు తప్పి మామ, కోడలు మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపు తప్పి మామ, కోడలు మృతి

Sep 18 2025 7:59 AM | Updated on Sep 18 2025 3:19 PM

బైక్‌

పూజ(25)

స్వల్పగాయాలతో బయటపడ్డ మృతురాలి భర్త

పైళ్లెన 10 నెలలకే విషాదం

మాక్లూర్‌ /నందిపేట్‌ (ఆర్మూర్‌): బైక్‌ అదుపు త ప్పిన ఘటనలో మామ, కోడలు మృతి చెందారు. ఈ ఘటన మాక్లూర్‌ మండలం దుర్గానగర్‌ శివారు లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నందిపేట మండలం తల్వేదకు చెందిన చింటు కు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొజన్‌కొత్తూర్‌కు చెందిన పూజ(25)తో 10 నెలల క్రిత మే వివాహం జరిగింది. 

బీటెక్‌ చదివిన పూజ పెళ్లికి ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేది. పెళ్లి సమయంలో ఉద్యోగం మానేసిన ఆమె మళ్లీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగానే ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై తమను నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద వదిలేసి రావాలని తండ్రి నారాయణ (58)ను చింటు కోరాడు. ముగ్గురూ కలిసి బైక్‌పై బయల్దేరారు. 

చింటు డ్రైవ్‌ చేస్తుండగా దుర్గానగర్‌ శివారులో బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయారు. నారాయణ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన పూజతోపాటు చింటును అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 10 గంటల సమయంలో పూజ మృతి చెందింది. మామ కోడలు మృతితో తల్వేదలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. ఘటనా స్థలాన్ని ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీ పరిశీలించారు.

బైక్‌ అదుపు తప్పి మామ, కోడలు మృతి 1
1/1

నారాయణ (58)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement