
ఎస్సారెస్పీలోకి భారీ వరద
● 1.92 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
● 38 గేట్ల ద్వారా 2.82 లక్షల అవుట్ ఫ్లో
బాల్కొండ: ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి లక్షా 92వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. మంగళవారం సాయంత్రానికి లక్షా 67 వేల క్యూసెక్కులకు తగ్గిన వరద.. బుధవారం ఉదయం 7 గంటల నుంచి క్రమంగా పెరిగింది. ఉదయం 10 గంటలకు 2 లక్షల 15 వేల క్యూసెక్కులకు చేరింది. బుధవారం సాయంత్రం వరకు ఇన్ఫ్లో నిలకడగా ఉండగా రాత్రి సమయానికి లక్షా 92వేలకు తగ్గింది. 38 వరద గేట్ల ద్వారా 2 లక్షల 82 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 6500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వే లు, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా ఆవిరి రూపంలో 701 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం రాత్రి సమయానికి 1087.06(68.04 టీఎంసీలు) అడుగులు నీరు నిల్వ ఉంది.