
అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● ప్రజావాణికి 115 ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 115 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు వివరించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.