పాస్‌ పుస్తకాలు ఎప్పుడొస్తాయ్‌? | - | Sakshi
Sakshi News home page

పాస్‌ పుస్తకాలు ఎప్పుడొస్తాయ్‌?

Sep 12 2025 6:35 AM | Updated on Sep 12 2025 6:35 AM

పాస్‌ పుస్తకాలు ఎప్పుడొస్తాయ్‌?

పాస్‌ పుస్తకాలు ఎప్పుడొస్తాయ్‌?

మేమిచ్చే పత్రాలు సరిపోతాయి

నెలల తరబడి నిరీక్షిస్తున్న రైతులు

పట్టా పాస్‌బుక్‌లు లేకపోవడంతో

రుణాలివ్వని బ్యాంకులు

ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు

మోర్తాడ్‌(బాల్కొండ) : పట్టాదారు పాస్‌ పు స్తకాలు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కొత్తగా భూములను కొ నుగోలు చేసిన అనేక మంది పాస్‌ పుస్త కాల కోసం మూడు, నాలుగు నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. వ్యవసా య భూమి రిజిస్ట్రేషన్‌ సందర్భంగా కొత్త పట్టాదా రు పాస్‌ పుస్తకం కోసం రూ.300 వసూలు చేస్తున్నా రు. గతంలో పాస్‌ పుస్తకం ఉన్న వారు భూమిని కొనుగోలు చేస్తే అందులోనే వివరాలను నమోదు చేసి ఇస్తున్నారు.

ఒక్కో మండలంలో 5 నుంచి 10 రిజిస్ట్రేషన్లు..

ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసా య భూములను తహసీల్‌ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ చేసిన వెంటనే మ్యు టేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ప్రొసీడింగ్‌ కాపీ, డూప్లికేట్‌ పీపీలను అందిస్తున్నా రు. అనంతరం రిజిస్ట్రేషన్‌ వివరాలు సీసీఎల్‌ కార్యాలయం ద్వారా బెంగళూరులోని ఏజెన్సీకి వెళ్తాయి. అక్కడ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట కొత్త పాస్‌ పుస్తకం ముద్రించి పోస్టులో ఇంటికి పంపిస్తారు. జిల్లాలోని చిన్న మండలాల్లో రోజుకు ఐదు, పెద్ద మండలాల్లో 10 చొప్పున రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇలా గత నాలుగైదు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న సుమారు వెయ్యి మందికి ఇప్పటి వరకు పట్టా పాస్‌ పుస్తకాలు అందలేదు.

బ్యాంకర్ల విముఖత

కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారు పంట రుణాలు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నా రు. తహసీల్‌ కార్యాలయంలో ఇచ్చే రిజిస్ట్రేషన్‌ ప త్రాలు, ప్రొసీడింగ్‌ కాపీలను చూపినా పంట రుణా లు ఇచ్చేందుకు బ్యాంకర్లు విముఖత చూపుతున్నా రు. వాస్తవానికి భూ భారతి వెబ్‌పోర్టల్‌లో రైతు వి వరాలను పరిశీలించి పంట రుణం ఇవ్వాలని ప్ర భుత్వం నిబంధన విధించింది. కానీ, బ్యాంకర్లు మాత్రం ఉన్నతాధికారుల సూచనల ప్రకారం పట్టా పాస్‌ పుస్తకం పరిశీలన తర్వాతే రుణాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు.

వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి వెంటనే ప్రొసీడింగ్‌ కాపీ, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ఇస్తున్నాం. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తున్నాం. పాస్‌ పుస్తకం లేకపోయినా ఆన్‌లైన్‌లో వివరాలను పరిశీలించి బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వాలి. పాస్‌ పుస్తకాలు పోస్టులో రావడానికి కొంత సమయం పడుతుంది.

– కృష్ణ, తహసీల్దార్‌, మోర్తాడ్‌

ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన రైతు నవీన్‌ ఎకరం వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. తహసీల్దార్‌ ప్రొసీడింగ్‌ కాపీ, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ అందజేశారు. కొత్త పట్టాపాస్‌ పుస్తకం పోస్టులో వస్తుందని చెప్పగా, నెల రోజులు గడచినా ఇంకా రాలేదు. రైతు తహసీల్‌ కార్యాలయంలో అడిగితే అది తమ పరిధిలో లేదని సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement