సమస్యల పరిష్కారానికే భూ భారతి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే భూ భారతి

Jun 13 2025 4:45 AM | Updated on Jun 13 2025 4:45 AM

సమస్యల పరిష్కారానికే భూ భారతి

సమస్యల పరిష్కారానికే భూ భారతి

అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తుందని అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని కంజర్‌ రైతువేదికలో గురువారం భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్‌ రామేశ్వర్‌ రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ భూ సమస్యలు ఉన్న రైతులంతా సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2014కు ముందు రాసుకున్న సాదాబైనామా, భూమి విస్తీర్ణం, పట్టాపాస్‌ పుస్తకంలో పేర్లు, విస్తీర్ణంలో తప్పులు, ఇతరత్రా సమస్యలన్నింటికీ భూభారతిలో పరిష్కారం దొరుకుతుందన్నారు. మండలంలో 1,342 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్‌ రామేశ్వర్‌ అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. అంతకుముందు నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌ దరఖాస్తులను పరిశీలించారు. వారి వెంట ఆర్‌ఐ రాజేశ్వర్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement