
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మోపాల్(నిజామాబాద్రూరల్): వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యా ధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి, డిప్యూటీ డీఎంహెచ్వో తుకా రాం రాథోడ్ సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, వైద్యసిబ్బందితో తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్లు, వన మహోత్సవం, బడిబాట తదితర అంశాలపై ఎంపీడీవో రాములు నాయక్ అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుకారాం రాథోడ్ మాట్లాడుతూ గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని తెలిపారు. మురుగుకాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, తాగునీటిని క్లోరినేషన్ చేయాలని సూచించారు. ఎంపీడీవో రాములు నాయక్ మాట్లాడుతూ మండలానికి 502 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, 178 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందన్నారు. సమావేశంలో మెడికల్ ఆఫీసర్ ప్రత్యూష, ఎంపీవో కిరణ్కుమార్, ఎంఈవో గేమ్సింగ్, ఏపీవో సునీత, ఏఈలు అన్నపూర్ణ, వినయ్కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.