నవీపేట: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో వేసిన మొరం కుప్పలను గురువారం చదును చేశారు. ఆవరణలో వర్షపు నీరు నిలుస్తుండడంతో మొరం వేసి చదును చేయించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. కానీ, మొరం కుప్పలను వేసిన అధికారులు వాటిని చదును చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు.
పాఠశాల పునఃప్రారంభం రోజే దర్శనమిచ్చిన వర్షపు నీరు...మొరం కుప్పల దుస్థితిపై ‘సాక్షి’లో ‘సారూ..బడికి ఎలా వెళ్లాలి’ శీర్షికన బుధవారం వార్త ప్రచురితమైంది. స్పందించిన అధికారులు గురువారం మొరం కుప్పలను బ్లేడ్ ట్రాక్టర్తో చదును చేయించారు.
మొరం కుప్పల చదును