
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
డీఈవో అశోక్
జక్రాన్పల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని డీఈవో అశోక్ పేర్కొన్నారు. జక్రాన్పల్లి మండలం లక్ష్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ బుక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. అనంతరం పదో తరగతిలో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థినులను డీఈవో అభినందించారు. ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ చిన్న సాయరెడ్డి, ఎంఈవో శ్రీనివాస్, హెచ్ఎం శ్రీనివాసరెడ్డి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గోపి, ప్రధాన కార్యదర్శి రవీణ్ తదితరులు పాల్గొన్నారు.