వ్యవసాయ వర్సిటీ స్థాపన దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ వర్సిటీ స్థాపన దినోత్సవం

Jun 13 2025 5:09 AM | Updated on Jun 13 2025 5:09 AM

వ్యవసాయ వర్సిటీ  స్థాపన దినోత్సవం

వ్యవసాయ వర్సిటీ స్థాపన దినోత్సవం

రుద్రూర్‌: హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం 61వ స్థాపన దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం రుద్రూర్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఆన్‌లైన్‌లో వీక్షించారు. విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి చేపట్టిన పరిశోధనలు, రూపొందించిన వంగడాలు, రైతుల జీవితాల్లో తెచ్చిన మార్పులపై వక్తలు వివరించారు. కార్యక్రమంలో పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్‌ టీ అంజయ్య, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, సిబ్బంది, వ్యవసాయ పాలిటెక్నిక్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ డైట్‌ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు అతిథి అధ్యాపక (గెస్ట్‌ లెక్చరర్‌) పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ టి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సొషియాలజీ, సైకాలజీ, సైన్స్‌, మ్యాథ్స్‌, సోషల్‌, తెలుగు, ఫైన్‌ ఆర్ట్స్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, సోషల్‌ సైన్స్‌ లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబెక్ట్‌లో పీజీ, ఎంఈడీ చేసిన 65 సంవత్సరాలలోపు వారు ఈనెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంఈడీ లేనిపక్షంలో బీఈడీ చేసిన వారికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 21న అర్హుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,600 నుంచి రూ.23,400 వరకు వేతనం అందించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు మెరిట్‌ ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహించి నియమిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 94404 14198 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఆలయంలో చోరీ

నవీపేట: మండల కేంద్రంలోని లింగం గుట్ట రేణుకా ఎల్లమ్మ ఆలయంలో దుండగులు చోరీ కి పాల్పడినట్లు ఎస్సై వినయ్‌ గురువారం తెలిపారు. ఆలయ నిర్వాహకుడు శేఖర్‌గౌడ్‌ గురువారం ఆలయానికి వెళ్లగా తాళాలు పగులగొట్టి ఉన్నాయని పేర్కొన్నారు. గర్భగుడిలోకి వెళ్లి చూడగా పంచలోహాల ఉత్సవ విగ్రహం, మంగళహారతులు, మైక్‌సెట్‌ తదితర వస్తువులను ఎత్తుకెళ్లారని తెలిపారు. శేఖర్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పేకాడుతున్న 10 మంది అరెస్టు

ఖలీల్‌వాడి: శాస్త్రీనగర్‌ గ్రామ శివారులో బుధవారం రాత్రి 12:30 గంటలకు పేకాడుతున్న 10 మందిని అరెస్ట్‌ చేసినట్లు ఆరో టౌన్‌ ఎస్సై వెంకట్రావు గురువారం తెలిపారు. మీర్జా జావీద్‌ బేగ్‌ ఖాళీ స్థలంలో ఉన్న రేకుల షెడ్డులో 10మంది పేకాట ఆడుతుండగా పట్టుకొని, వారి నుంచి రూ.76 వేలు, ఒక కారు, రెండు బైక్‌లు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

ప్రభుత్వ భూములు కాపాడాలి

ఆర్మూర్‌టౌన్‌: పెర్కిట్‌లో విజేత అపార్ట్‌మెంట్‌ పక్కన గల ఇరిగేషన్‌ ల్యాండ్‌ను అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాజుకు గురువారం ఖాందేశ్‌ ప్రశాంత్‌ ఫిర్యాదు చేశారు. గతంలో ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశానన్నారు. ఇరిగేషన్‌, 10 శాతం ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు.

పొక్లెయిన్‌ సీజ్‌

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని అటవీ భూమిలో రెండు రో జుల క్రితం పొదలను తొలగించిన పొక్లెయిన్‌ ను పట్టుకొని సీజ్‌ చేసినట్లు ఫారెస్ట్‌ రేంజ్‌ అధి కారి వాసుదేవ్‌ గురువారం తెలిపారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తు లు ఎర్రకుంట తండా సమీపంలోని అటవీభూమిలో పొదలను తొలగించారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు విచారణ చేపట్టామన్నారు. పొదలను తొలగించిన మెదక్‌ జిల్లా కు చెందిన పొక్లెయిన్‌ను పట్టుకొని కేసు న మోదు చేసి సీజ్‌ చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement